సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త ఉపాధి మార్గాలు చూపే లక్ష్యంతో, ‘డిజిప్రెన్యూర్.ఏఐ’ (Digipreneur.ai) వ్యవస్థాపకులు శ్రీ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు ఏఐ బూట్క్యాంప్ 2.O’ స్నాతకోత్సవం శనివారం (26-07-2025) హైదరాబాద్లోని టి-హబ్లో అత్యంత వైభవంగా జరిగింది.
వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థులు అనే తేడా లేకుండా ఎవరైనా సరే కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను ఉపయోగించి స్వయంగా ఆదాయం సంపాదించడం, తమ వృత్తి, వ్యాపార, విద్యా రంగాల్లో రాణించడం ఎలాగో నేర్పడమే లక్ష్యంగా గత 21 రోజులుగా ఈ కోర్సును ఆన్లైన్లో నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి పట్టాలను అందించేందుకు ఈ స్నాతకోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గంపా నాగేశ్వర్ రావు, ప్రముఖ ప్రేరణ వక్త, బిజినెస్ కోచ్ శ్రీ వేణుకళ్యాణ్, ‘ఆన్ఈజీ’ (Oneasy) వ్యవస్థాపకులు శ్రీ అభిషేక్ బొడ్డు, ‘8ఎఫ్ఎక్స్’ (8fx) వ్యవస్థాపకులు శ్రీ కరణ్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ నైపుణ్యాలను అలవర్చుకోవడం నేటి యువతకు అత్యంత అవసరమని, ఈ టూల్స్ను సరిగ్గా వినియోగించుకుంటే అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని దిశానిర్దేశం చేశారు. అనంతరం, శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పట్టాలను ప్రదానం చేసి అభినందించారు. ఆధునిక సాంకేతికతను తెలుగులో అందుబాటులోకి తీసుకురావడంపై నిర్వాహకులను పలువురు ప్రశంసించారు.
తరువాతి తెలుగు ఏఐ బూట్ క్యాంప్ 2.O ఆగష్ట్ 11 తేదీ నుండి మొదలవ్వనుంది. మరిన్ని వివరాల కోసం 7331112686 7331112687 7331112688 నంబర్ లను సంప్రదించండి.