• Contact Us
Tuesday, July 14, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

ఒకే తాటిపైకి వైశ్య వ్యాపారవేత్తలు: ఘనంగా జీవీబీఎల్ ఆవిర్భావం

Telugu World by Telugu World
August 2, 2025
in వ్యాపారం, అంతర్జాతీయ
Reading Time: 1 min read
0
ఒకే తాటిపైకి వైశ్య వ్యాపారవేత్తలు: ఘనంగా జీవీబీఎల్ ఆవిర్భావం

వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్‌వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం జీవీబీఎల్ లోగో, వెబ్‌సైట్ ఆవిష్కరణకు, నూతన నాయకత్వ బృందం ప్రకటనకు, తెలంగాణ వ్యాప్తంగా ఏడు కొత్త చాప్టర్ల ఏర్పాటుకు వేదికగా నిలిచింది. ప్రతి వైశ్య వ్యాపార వేత్తకు సాధికారత కల్పించడం, స్థానిక వ్యాపారాలను ప్రపంచ స్థాయి ఆలోచనలతో అనుసంధానించడం లక్ష్యంగా ఐక్యత, విశ్వాసం, వ్యాపార నైపుణ్యాన్ని పెంపొందించేందుకు జీవీబీఎల్ కృషి చేయనుంది.

వివిధ జిల్లాల నుంచి ప్రముఖులు, వ్యాపార వేత్తలు హాజరైన ఈ వేడుకలో, 2025–26 సంవత్సరానికి గాను సంస్థకు మార్గనిర్దేశం చేసే తొలి ఎన్నికైన కార్యవర్గం ‘టైటాన్ కౌన్సిల్’ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా ప్రసాద్ జిల్లా, కార్యదర్శిగా రవి కొండూరి, కోశాధికారిగా తరుణ్ చింత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా చాప్టర్ల వృద్ధికి క్రాంతి కుమార్, ఈవెంట్స్‌కు సంతోష్ బజ్జూరి, శిక్షణ-మార్కెటింగ్‌కు నిఖీలు గుండ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి శ్రీనివాస్ గండేస్రి, అంతర్జాతీయ వృద్ధికి డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. కార్యవర్గ సభ్యులుగా కరీంనగర్‌కు చెందిన వేణు, రాచమల్ల ప్రసాద్, పల్లా కృష్ణమోహన్ నియమితులయ్యారు.

హైదరాబాద్‌లో జరిగిన GVBL (గ్లోబల్ వైశ్య బిజినెస్ లీగ్) ఈవెంట్‌లో ప్రణవ హైదరాబాద్ ఛాప్టర్‌ను 60 మంది స్థాపక సభ్యులతో ఘనంగా ప్రారంభించారు. ఈ ఛాప్టర్‌కు CA శివ తేజ చైర్మన్‌గా, డా. శాలినీ వైస్ చైర్మన్ (ఆపరేషన్స్)గా, పవన్ వుప్పల వైస్ చైర్మన్ (ఫైనాన్స్)గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే, కరీంనగర్‌లోని కపిలా ఛాప్టర్‌కు ఎల్లంకి అనిల్ కుమార్ చైర్మన్‌గా, జి. సాయి కృష్ణ వైస్ చైర్మన్ (ఆపరేషన్స్)గా, పి. సంతోష్ కుమార్ వైస్ చైర్మన్ (ఫైనాన్స్)గా నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని సుముఖ ఛాప్టర్‌కి నరేష్ కుమార్ చైర్మన్‌గా, శివ కుమార్ ఎస్ వైస్ చైర్మన్ (ఆపరేషన్స్)గా, పి. వినోద్ కుమార్ వైస్ చైర్మన్ (ఫైనాన్స్)గా ఉన్నారు. వరంగల్‌లోని కాకతీయ ఛాప్టర్‌కి వోలమ్ ప్రభుకిరణ్ చైర్మన్‌గా, బోద్ల రవీంద్రనాథ్ వైస్ చైర్మన్ (ఆపరేషన్స్)గా, ప్రభాకర్ వోలిశెట్టి వైస్ చైర్మన్ (ఫైనాన్స్)గా ఉన్నారు. కాల్కి ఛాప్టర్‌ (హైదరాబాద్)కు కాచం రుషికేశ్ చైర్మన్‌గా, నగమళ్ల సౌజన్య వైస్ చైర్మన్ (ఆపరేషన్స్)గా, బోద్ల శ్రీనివాస్ వైస్ చైర్మన్ (ఫైనాన్స్)గా వ్యవహరిస్తున్నారు. సిద్ధిపేటలోని సిద్ధి ఛాప్టర్‌కి డా. మంకల నవీన్ చైర్మన్‌గా, జి. లక్ష్మణ్ కుమార్ వైస్ చైర్మన్ (ఆపరేషన్స్)గా, టి. రంజిత్ కుమార్ వైస్ చైర్మన్ (ఫైనాన్స్)గా నియమించబడ్డారు.

మహిళా సాధికారతకు ‘జీవీబీఎల్ నారి’
మహిళల నేతృత్వంలోని వైశ్య వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ‘జీవీబీఎల్ నారి’ పేరుతో మహిళా చాప్టర్‌ను ప్రారంభించనున్నట్లు జీవీబీఎల్ ప్రకటించింది. ప్రత్యేక నాయకత్వ కార్యక్రమాలు, మార్గదర్శకత్వం, నెట్‌వర్కింగ్ అవకాశాల ద్వారా మహిళా వ్యాపార వేత్తలకు చేయూతనివ్వడం ఈ చాప్టర్ ముఖ్య ఉద్దేశం.

Related Post

Massive Investment in AI: TCS to Hire 8,900 AI Engineers

Claude AI భారత్‌లో చెల్లింపు ప్లాన్లు ప్రారంభం.. నెలకు రూ.1,999 నుంచే సబ్‌స్క్రిప్షన్!

యూజర్ల ఆగ్రహానికి మెటా వెనక్కి.. ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు

యువ వ్యవస్థాపకుడు AI టోకెన్లపై రూ.25 లక్షల ఖర్చు.. అయినా ఎందుకు “ఇది సరైన పెట్టుబడి” అన్నాడు?

దార్శనికత, లక్ష్యాలు
సాధికారత, అనుసంధానం, ఐక్యత, విశ్వాసం అనే నాలుగు స్తంభాల ఆధారంగా జీవీబీఎల్ తన లక్ష్యాలను నిర్దేశించుకుంది. పారదర్శకమైన కార్యకలాపాలు, నాయకత్వ జవాబుదారీతనం, ఉన్నత స్థాయి నెట్‌వర్కింగ్‌కు అనువైన నిర్మాణాన్ని రూపొందించింది.

భవిష్యత్ ప్రణాళికలు
మొదటి సంవత్సరంలో ఖమ్మం, ఏలూరు, కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, ఆదిలాబాద్‌లలో చాప్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు జీవీబీఎల్ ప్రకటించింది. అంతేకాకుండా, అమెరికాలోని డల్లాస్‌లో మూడు అంతర్జాతీయ చాప్టర్లను స్థాపించి, వైశ్య వ్యాపారాలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

జీవీబీఎల్ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజశేఖర్ మంచి మాట్లాడుతూ, “జీవీబీఎల్ కేవలం ఒక వ్యాపార నెట్‌వర్క్ కాదు. ఇది అర్థవంతమైన సంబంధాలు, నిర్మాణాత్మక అభివృద్ధి, వారసత్వ నిర్మాణం ద్వారా వైశ్య వ్యాపార స్ఫూర్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఒక సామూహిక యాత్ర. మేము ఏర్పాటు చేసే ప్రతి చాప్టర్ ఒక అభివృద్ధి చోదక శక్తి, నియమించే ప్రతి నాయకుడు శ్రేష్ఠతకు మార్గదర్శి” అని ఉద్ఘాటించారు.

చాప్టర్లకు మార్గదర్శకులుగా ‘లాంచ్ అంబాసిడర్లు’
నూతన చాప్టర్లకు మార్గదర్శకత్వం అందించేందుకు అనుభవజ్ఞులైన నాయకులను ‘లాంచ్ అంబాసిడర్లు’గా నియమించారు. కపిల చాప్టర్‌కు ప్రసాద్ జిల్లా; కాకతీయ చాప్టర్‌కు ప్రసాద్ జిల్లా, వేణుగోపాల్ కొండూరి; సిద్ధి చాప్టర్‌కు వేణుగోపాల్ కొండూరి, పల్లా శివ కుమార్, ఏలుగూరి విజయ భాస్కర్; కల్కి, సుముఖ చాప్టర్లకు రవి కొండూరి, కృష్ణ మోహన్ గుప్తా మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు.

ఈ వేగవంతమైన వ్యాపార సంఘంలో చేరాలనుకునే వైశ్య వ్యాపార వేత్తలు, నిపుణులు, వ్యాపార యజమానులు అధికారిక వెబ్‌సైట్ www.GVBLnetwork.com ద్వారా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్మాణాత్మక రిఫరల్స్, నాయకత్వ అవకాశాలు, జాతీయ, అంతర్జాతీయ నెట్‌వర్కింగ్‌తో జీవీబీఎల్ తమ వ్యాపార ప్రయాణంలో కొత్త శిఖరాలను అధిరోహించాలనుకునే వారికి ఇదే మా ఆహ్వానం అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్పష్టమైన మార్గసూచి, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంతో జీవీబీఎల్ వైశ్య వ్యాపార సమాజంలో నూతన ఐక్యతకు, ఆశయాలకు ప్రతీకగా నిలిచింది.

Tags: CEO RajashekarChaptersGlobalGlobal Vaishya Business leagueGVBLNaari
Share217Tweet136SendSend

Related Posts

Massive Investment in AI: TCS to Hire 8,900 AI Engineers
అంతర్జాతీయ

Massive Investment in AI: TCS to Hire 8,900 AI Engineers

టీసీఎస్ భారీ AI ప్లాన్.. 8,900 మంది AI ఇంజినీర్లు, AI కంపెనీల కొనుగోళ్లు.. అసలు ప్లాన్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది....

by admin
July 14, 2026
Claude AI భారత్‌లో చెల్లింపు ప్లాన్లు ప్రారంభం.. నెలకు రూ.1,999 నుంచే సబ్‌స్క్రిప్షన్!
టెక్నాలజీ

Claude AI భారత్‌లో చెల్లింపు ప్లాన్లు ప్రారంభం.. నెలకు రూ.1,999 నుంచే సబ్‌స్క్రిప్షన్!

Anthropic Claude AI India Subscription Plans: భారత్‌లో రూ.1,999 నుంచే క్లాడ్ AI ప్లాన్లు.. ఏ ప్లాన్‌లో ఏ ఫీచర్లు? Anthropic Claude AI భారత్‌లో...

by admin
July 13, 2026
Next Post
ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

Massive Investment in AI: TCS to Hire 8,900 AI Engineers

Massive Investment in AI: TCS to Hire 8,900 AI Engineers

July 14, 2026
Claude AI భారత్‌లో చెల్లింపు ప్లాన్లు ప్రారంభం.. నెలకు రూ.1,999 నుంచే సబ్‌స్క్రిప్షన్!

Claude AI భారత్‌లో చెల్లింపు ప్లాన్లు ప్రారంభం.. నెలకు రూ.1,999 నుంచే సబ్‌స్క్రిప్షన్!

July 13, 2026
యూజర్ల ఆగ్రహానికి మెటా వెనక్కి.. ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు

యూజర్ల ఆగ్రహానికి మెటా వెనక్కి.. ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు

July 11, 2026
యువ వ్యవస్థాపకుడు AI టోకెన్లపై రూ.25 లక్షల ఖర్చు.. అయినా ఎందుకు “ఇది సరైన పెట్టుబడి” అన్నాడు?

యువ వ్యవస్థాపకుడు AI టోకెన్లపై రూ.25 లక్షల ఖర్చు.. అయినా ఎందుకు “ఇది సరైన పెట్టుబడి” అన్నాడు?

July 10, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us