AIతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించిన AI Trainer దివ్య మిట్టా
ఏటూరునాగారం: మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను తమ విద్య, నైపుణ్యాలతో అనుసంధానం చేసుకోవాలని AI Trainer దివ్య మిట్టా సూచించారు. ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ప్రత్యేక అవగాహన వర్క్షాప్ను నిర్వహించారు.
Sanjosh Foundation ఆధ్వర్యంలో, హీరో సంజోష్ గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా AI Trainer దివ్య మిట్టా విద్యార్థులకు AI వినియోగం, దాని ద్వారా అందుబాటులోకి వస్తున్న అవకాశాలు, భవిష్యత్ కెరీర్ మార్గాలు, స్వయం ఉపాధి మరియు ఎంట్రప్రెన్యూర్షిప్పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా దివ్య మిట్టా మాట్లాడుతూ, AI నేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా coding నేర్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కోడింగ్పై ముందస్తు పరిజ్ఞానం లేకపోయినా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక AI toolsను సులభంగా ఉపయోగించడం నేర్చుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు తమకు ఇప్పటికే ఉన్న విద్య, నైపుణ్యాలకు AIని జోడించుకుంటే మరిన్ని అవకాశాలను సృష్టించుకోవచ్చని వివరించారు.
ప్రస్తుతం AI కారణంగా ఉద్యోగాల స్వరూపం మారడంతో పాటు, కొత్త రకాల job roles, career opportunities కూడా ఏర్పడుతున్నాయని ఆమె తెలిపారు. ముఖ్యంగా Prompt Engineering వంటి skillsకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పారు. సరైన prompts రూపొందించడం ద్వారా AI నుంచి అవసరమైన సమాచారాన్ని పొందడమే కాకుండా, వివిధ సమస్యలకు పరిష్కారాలను రూపొందించే సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చని వివరించారు.
AI సహాయంతో ఒక ఆలోచనను కేవలం ఆలోచనగానే ఉంచకుండా దాన్ని product, website లేదా appగా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని దివ్య మిట్టా తెలిపారు. విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను గమనించి, వాటికి technology మరియు AI సహాయంతో పరిష్కారాలను రూపొందిస్తే భవిష్యత్తులో ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఉద్యోగాలను సృష్టించే entrepreneursగా ఎదగవచ్చని సూచించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు స్థానిక సమస్యలే కొత్త అవకాశాలకు పునాదిగా మారవచ్చని ఆమె వివరించారు. విద్యార్థులు తమ ప్రాంతంలోని రైతులు, చిన్న వ్యాపారులు, స్థానిక సంస్థలు లేదా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి AI ఆధారిత పరిష్కారాలను రూపొందించగలిగితే వాటి ద్వారా ఆదాయ మార్గాలను కూడా సృష్టించుకోవచ్చని చెప్పారు.
ఒక చిన్న సమస్యకు సరైన పరిష్కారం చూపించే ఆలోచనే భవిష్యత్తులో ఒక startup లేదా businessకు పునాదిగా మారవచ్చని దివ్య మిట్టా అన్నారు. AIని కేవలం చదువుకోవడానికి ఉపయోగించే technologyగా కాకుండా, కొత్త skills నేర్చుకోవడానికి, projects రూపొందించడానికి, ideasను అమలు చేయడానికి, business opportunitiesను గుర్తించడానికి ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా హీరో సంజోష్ గారు మాట్లాడుతూ, విద్యార్థులు AI వంటి ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడానికి ముందుకు రావాలని కోరారు. AI training పొందేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు అవసరమైన guidance అందించడంతో పాటు, శిక్షణకు సంబంధించిన సహాయం మరియు ఆర్థికంగా అవసరం ఉన్న విద్యార్థులకు తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
విద్యార్థుల్లో technology skillsను పెంపొందించి, వారిని భవిష్యత్ ఉద్యోగాలకు మాత్రమే కాకుండా self-employment, startups మరియు entrepreneurship వైపు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వర్క్షాప్ ద్వారా విద్యార్థులకు AIపై ప్రాథమిక అవగాహన కల్పించడంతో పాటు, తమ ఆలోచనలను technology solutionsగా మార్చుకోవడం, సమస్యలకు పరిష్కారాలను రూపొందించడం, భవిష్యత్తులో తమకంటూ ఒక ఆదాయ వనరును సృష్టించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
దివ్య మిట్ట
ఇమెయిల్: divyamitta.ce@gmail.com.






