జూన్ 22, 2025 – అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష మందికి పైగా ప్రజలు భాగస్వామ్యం చేసిన “యోగసింధూర్ – ఆరోగ్య భారత్ ఉద్యమం” విజయవంతంగా పూర్తవడంతో, జూలై 6న హైదరాబాదులోని టి-హబ్ వేదికగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లు శ్రీ మురళి నాయక్ మరియు శ్రీ బి. సంతోష్ కుమార్ గార్ల కుటుంబాలకు రూ. 1,00,000 చొప్పున మొత్తం రూ. 2 లక్షల చెక్కులు అందజేయడం జరిగింది.
మిగిలిన రూ. 1,30,070ను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి అందజేశారు.
ఈ ఉద్యమంలో 250 మంది వాలంటీర్లు, లక్ష మందికి పైగా పాల్గొన్న భాగస్వాములు, దేశవ్యాప్తంగా చైతన్యాన్ని రగిలించారు. దీన్ని గుర్తించిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్,
డా. యోగ నారాయణ గారు మరియు యోగసింధూర్ కమిటీ అధ్యక్షులు శ్రీ కె. శివ దుర్గాప్రసాద్ గారికి వరల్డ్ రికార్డు సర్టిఫికేట్లను ప్రదానం చేసింది. ఈ రికార్డులను పూజ్యులు కే. శివ నారాయణ దంపతుల చేతుల మీదుగా అందజేయడం విశేషం.

ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ నిఖిల్ గుండా గారు (AI Guru, డిజిటల్ కనెక్ట్స్) యోగా జీవనశైలిలో భాగం కావాలని సూచించగా, శ్రీ సదాశివ గారు యోగాన్ని వివేకానందుని దృక్కోణంలో వివరిస్తూ సమాజ ఆరోగ్యంపై ప్రస్తావించారు.
ఈ సందర్భంగా వాలంటీర్లకు, పార్టిసిపెంట్స్కు గౌరవ సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని డా. యోగ నారాయణ గారి నాయకత్వంలో సక్సెస్ లైఫ్ ఫౌండేషన్ మరియు యోగసింధూర్ ఆర్గనైజింగ్ కమిటీ విజయవంతంగా నిర్వహించాయి.
🧘♀ “మన ఆరోగ్యం – మన దేశ బలం!”
🇮🇳 జై హింద్! జై భారత్! వందే మాతరం!