ఏలూరులో MRI స్కాన్ చేయించుకున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. ఆమె శరీరంలో పేస్ మేకర్ ఉండగా, వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది. MRI స్కాన్లో శక్తివంతమైన మాగ్నెటిక్ ఫీల్డ్ ఉండటం వల్ల లోహపు పరికరాలు ఉన్నవారికి ప్రమాదకరంగా మారుతుంది. అయితే, ఆసుపత్రి సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో హృదయ స్పందన ఆగిపోయి మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం విచారణ చేపట్టింది. వైద్యులు MRI స్కాన్ ముందు రోగుల వైద్య చరిత్రను పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. శరీరంలో మెటల్ పరికరాలు (పేస్ మేకర్, స్టెంట్స్, ఆర్టిఫిషియల్ జాయింట్స్) ఉన్నవారు MRI గదిలోకి వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.