జార్జ్టౌన్, టెక్సాస్లోని హరి హర క్షేత్రం ఆలయంలో మార్చి 30, 2025న ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్న ఈ వేడుకలకు ప్రముఖ మానసిక నిపుణుడు సుధీర్ సండ్ర గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ సంగీత ప్రదర్శనలు, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత, భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా, సుధీర్ సండ్ర గారు ఉగాది ప్రత్యేకత, జీవితంలో సానుకూల ఆలోచనల ప్రాముఖ్యతపై స్పెషల్ స్పీచ్ ఇవ్వనున్నారు. అలాగే, హరి హర క్షేత్రం ఛైర్మన్ డా. భరత్ కుమార్ కక్కిరేని, ప్రముఖ గాయని శ్రుతి రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు, విద్యార్థులు, భక్తులు పాల్గొని ఉగాదిని సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకోవచ్చు.
కార్యక్రమ వివరాలు:
తేదీ: మార్చి 30, 2025
సమయం: సాయంత్రం 4:30 PM – 8:30 PM
స్థలం: హరి హర క్షేత్రం ఆలయం, 375 King Rea, Georgetown, TX 78633
ప్రవేశ రుసుము $30 కాగా, మరిన్ని వివరాల కోసం +1 (945) 544-2954 నంబర్కు సంప్రదించవచ్చు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో ఉగాదిని ఘనంగా జరుపుకుందాం!