పాకిస్తాన్లో మార్చి 11, 2025న తీవ్రవాదులు భారీ ఉగ్రదాడికి పాల్పడ్డారు. క్వెట్టా నుంచి ప్రయాణం ప్రారంభించిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) అనే ఉగ్రవాద సంస్థ హైజాక్ చేసింది. సుమారు 400 మంది ప్రయాణికులు ఉన్న రైలును నిలిపివేసిన ఉగ్రవాదులు ప్రయాణికులను బంధించి, పాకిస్తాన్ ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేసేందుకు ఈ దాడికి దిగారు. బలూచిస్తాన్ ప్రాంతంలో స్వయం పాలన, ప్రకృతి వనరులపై పూర్తి నియంత్రణ సాధించేందుకు BLA ఈ తరహా దాడులు చేస్తోంది.

ఈ దాడిలో 150 మంది ప్రయాణికులు మరణించారు. వెంటనే స్పందించిన పాకిస్తాన్ సైన్యం ‘రెస్క్యూ ఆపరేషన్’ చేపట్టి, సుమారు 354 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించింది. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 33 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సైనికులు, రైల్వే సిబ్బందితో సహా మొత్తం 26 మంది మరణించారు.
పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దాడికి అఫ్గానిస్తాన్, భారత్ సహకారం ఉందని ఆరోపిస్తుండగా, ఈ ఆరోపణలను రెండు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఘటన అనంతరం బలూచిస్తాన్లో భద్రత కట్టుదిట్టం చేసి, రైల్వే, ఇతర ప్రభుత్వ సేవలపై నిఘాను మరింత పెంచింది.