వనస్థలిపురంకు చెందిన రియల్ ఎస్టేట్ మరియు ఇన్సూరెన్స్ రంగంలో ఫైనాన్షియల్ అడ్వైజర్ గా విజయవంతంగా రాణిస్తున్న లయన్ మాదాస్ అశ్విన్ కుమార్ ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని లయన్ మాదాస్ అశ్విన్ కుమార్కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా లయన్ మాదాస్ అశ్విన్ కుమార్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా ఫైనాన్షియల్ అడ్వైజరీ నైపుణ్యాలను సాంకేతికంగా మరింత బలోపేతం చేసింది. AI టూల్స్ను ప్రాక్టికల్గా ఉపయోగించడం ద్వారా రియల్ ఎస్టేట్ మరియు ఇన్సూరెన్స్ రంగాలలో నా సేవలు మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా క్లయింట్లకు మరింత సమర్థవంతమైన ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అందించడానికి మరియు వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1, 2025 నుండి ప్రారంభం కానుంది.