Pakistan: పాకిస్తాన్లో బలూచిస్తాన్ మిలిటెంట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. జఫ్ఫార్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేశారు. ఏకంగా 30మంది పాక్ సైనికులను కాల్చిచంపారు. అంతేకాదు.. 214 మంది భద్రతాసిబ్బందిని మిలిటెంట్లు బంధించాయి. అయితే బందీని విడిపించేందుకు పాక్ సైన్యం ఆపరేషన్ చేపట్టింది.
ఈ ఆపరేషన్లో 16 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అలాగే 104 మంది ప్రయాణికులను భద్రతా బలగాలు రక్షించాయి. ఇక మిలిటెంట్లు హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్ప్రెస్లోని.. 9 బోగీల్లో సుమారు 400 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.