Sabarimala Special Trains హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏడాది కార్తీక మాసంలో అయ్యప్ప మండల దీక్ష ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలకు ప్రయాణాలు చేసేలా ప్లాన్ చేసుకుంటారు. 41 రోజుల పాటు కఠినమైన దీక్షను చేపట్టి ఇరుముడి కట్టి శబరిగిరులకు వెళ్లి మణికంఠుడిని దర్శించుకుంటారు. ఇటీవలే అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు కూడా తెరచుకున్నాయి. ఈ నేపథ్యంలో స్వామి వారి దర్శనం కోసం లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు నడిపాలని నిర్ణయిం తీసుకుంది. ఇప్పటికే కొన్ని స్పెషల్ ట్రైన్స్ నడుస్తుండగా.. రద్దీకి అనుగుణంగా మరో 9 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏ రైలు ఎప్పటినుంచి.. ఎక్కడిదాకా వెళ్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
శబరిమలకు ప్రత్యేక రైళ్లు..

ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.
ట్రైన్ నెంబర్ (07131) నవంబర్ 17, 24వ తేదీల్లో ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు హైదరాబాద్(కాచిగూడ)లో బయలుదేరి.. గుంటూరు, నెల్లూరు, రేణిగుంట మీదుగా కొట్టాయం మరుసటిరోజు చేరుకుంటుంది. అక్కడి నుంచి పంబ వరకు బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అనంతరం కాలినడకన శబరిమల చేరుకోవాలి. మళ్లీ తిరిగి అదే రైలు(07132) కొట్టాయం నుంచి ప్రారంభమై మరుసటి రోజు కాచిగూడకు అర్ధరాత్రి ఒంటి గంటకు చేరుకుంటుంది.
మరిన్ని అదనపు రైళ్లు..

రైలు నెంబర్ (07133) నవంబర్ 14, 21,28వ తేదీల్లో కాచిగూడ టు కొట్టాయం వరకు
రైలు నెంబర్ (07134) నవంబర్ 15, 22, 29వ తేదీల్లో కొట్టాయం నుంచి కాచిగూడ వరకు
రైలు నెంబర్ (07135) నవంబర్ 19, 26వ తేదీల్లో హైదరాబాద్ టు కొట్టాయం వరకు
రైలు నెంబర్ (07136) నవంబర్ 20, 27వ తేదీల్లో కొట్టాయం టు హైదరాబాద్
రైలు నెంబర్ (07137) నవంబర్ 15, 22, 29వ తేదీల్లో హైదరాబాద్ టు కొట్టాయం వరకు
రైలు నెంబర్ (07138) నవంబర్ 16, 23, 30వ తేదీల్లో కొట్టాయం టు హైదరాబద్ వరకు
రైలు నెంబర్ (07140) నవంబర్ 18 నుంచి కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు
రైలు నెంబర్ (07143) నవంబర్ 22, 29వ తేదీల్లో మౌలాలి టు కొల్లాం వరకు
రైలు నెంబర్ (07144) నవంబర్ 24, డిసెంబర్ 1న కొల్లాం టు మౌలాలి
రైలు నెంబర్ (07145) నవంబర్ 18, 25వ తేదీల్లో మచిలీపట్నం టు కొల్లాం వరకు
రైలు నెంబర్ (07146) నవంబర్ 20, 27వ తేదీల్లో కొల్లాం టు మచిలీపట్నం వరకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
బెంగళూరు టు తిరువనంతపురానికి ప్రత్యేక రైళ్లు..

తిరువనంతపురం నుంచి బెంగళూరుకు కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ రైళ్లు కొల్లాం, కొట్టాయం మీదుగా గమ్యస్థానాలకు చేరుకుంటాయి.రైలు నెంబర్(06083) తిరువనంతపురం(కొచువెలి) నుంచి బెంగళూరు(SMVT) వీక్లీ స్పెషల్ ట్రైన్ కొచువెలిలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి కొల్లాం, కొట్టాయం మీదుగా మరుసటి రోజు ఉదయం 10:55 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు నవంబర్ 19, 26, డిసెంబర్ 03, 10, 17, 24, 31, కొత్త ఏడాది 2025 జనవరిలో 07, 14, 28వ తేదీల్లో నడుస్తుంది. ఇదే రైలు(06084)బెంగళూరు నుంచి తిరువనంతపురానికి నవంబర్ 20, 27, డిసెంబర్ 04, 11, 18, 25 మరియు 2025 జనవరి 01, 08, 15, 22, 29వ తేదీల్లో నడుస్తుంది. ఈ రైలు బెంగళూరు(SMVT) నుంచి మధ్యాహ్నం 12:55 గంటలకు ప్రారంభమవుతుంది.
హుబ్లీ టు శబరిమలై..

రైలు నెంబర్ 07371 హుబ్లీ టు కొట్టాయం స్పెషల్ ట్రైన్ నవంబర్ 19, 26, డిసెంబర్ 03, 10, 17, 24, 31, వచ్చే ఏడాది జనవరి 17, 14వ తేదీ వరకు నడుస్తుంది. అదే విధంగా తిరిగి కొట్టాయం టు హుబ్లీకి 07372 రైలు నవంబర్ 20, 27, డిసెంబర్ 04, 11, 18, 25 మరియు జనవరి 01, 08, 15వ తేదీల్లో నడుస్తుంది. హుబ్లీ నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కొట్టాయం చేరుకుంటుది. అదే విధంగా తిరిగి కొట్టాయంలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి హుబ్లీకి మధ్యాహ్నం 12:50 గంటలకు చేరుకుంటుంది.