మల్లాపూర్కు చెందిన స్కంద బ్యాంక్వెట్స్ వ్యవస్థాపకురాలు సముద్రాల గాయత్రి ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని సముద్రాల గాయత్రికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా సముద్రాల గాయత్రి మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది. AI టూల్స్ను ప్రాక్టికల్గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ స్కంద బ్యాంక్వెట్స్లో నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ జూన్ 1 వ తారీఖున మొదలవ్వనుంది..
తెలంగాణ లోక్ భవన్లో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి గస్ట్ గా హాజరైన పటాన్చెరు, శ్రీ సాయి గణేష్ కాలనీకి చెందిన వే టూ ఎక్స్పెర్ట్స్ ఫౌండర్ కొడాలి సునీల్ గారు, అక్షయ విద్య...







