హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త తాడిపర్తి నాగార్జున ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని తాడిపర్తి నాగార్జునకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా తాడిపర్తి నాగార్జున మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వ్యాపార దృష్టికోణాన్ని సాంకేతికంగా సుసంపన్నం చేసింది. AI టూల్స్ను ప్రాక్టికల్గా ఉపయోగిస్తూ నా వ్యాపార నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా వ్యాపారంలో నూతన ఆవిష్కరణలను ప్రవేశపెట్టడానికి మరియు సమర్థవంతమైన వ్యూహాలను అమలు చేయడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1, 2025 నుండి ప్రారంభం కానుంది.
T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
జోగులాంబ గద్వాల్ జిల్లా, గట్టు మండలం, తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన మోటివేషనల్ స్పీకర్, ఎంట్రప్రెన్యూర్ మరియు రియల్ వర్సిటీ ఫౌండర్ ఇల్లూరు ఉరుకుందు శెట్టి, ప్రఖ్యాత AI...