• Contact Us
Thursday, May 15, 2025
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

పెన్నహోబిలం హుండీలోని నగల మూట మాయం.. తెల్లారేసరికి ప్రత్యక్షం.. దేవుడితో పెట్టుకుంటే అంతే!

Telugu World by Telugu World
March 20, 2025
in Uncategorized
Reading Time: 1 min read
0
పెన్నహోబిలం హుండీలోని నగల మూట మాయం.. తెల్లారేసరికి ప్రత్యక్షం.. దేవుడితో పెట్టుకుంటే అంతే!

Related Post

T-Hubలో కల్వా హసిని‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

T-Hubలో మురళీ క్రిష్ణ వల్లపురం కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

ఏలూరులో MRI స్కాన్ ప్రమాదం – మహిళ మృతి

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఉన్న పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సిబ్బంగదిచేతివాటం ప్రదర్శించారు. భక్తులు హుండీలో వేసిన నగల మూటను తస్కరించే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్లాన్ బెడిసి కొట్టి.. నగలమూటను తిరిగి హుండీలో వేయాల్సి వచ్చింది. ఈ ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేలూరు రంగయ్య అనే వ్యక్తి భార్యతో కలిసి పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామిని గతేడాది దర్శించుకున్నారు. డిసెంబర్ ఏడో తేదీన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న వేలూరు రంగయ్య దంపతులు.. మొక్కులు చెల్లించుకున్నారు. రూ.8లక్షల విలువైన నగలను మూట కట్టి ఆలయ హుండీలో వేశారు.

అయితే పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు ఇటీవల హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. మార్చి 18వ తేదీన ఈవో రమేష్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సమయంలో కొంతమంది సిబ్బంది.. హుండీలోని ఈ నగలమూటను గుర్తించారు. నగలను కాజేయాలనే దుర్బుద్ధితో మూటను దాచి పెట్టారు. మొత్తం హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక.. ఈ నగల మూటను పంచుకోవాలని ఆలయ సిబ్బంది పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. అయితే కథ అడ్డం తిరిగింది.
పంపకాల్లో తేడా రావటంతో సీన్ రివర్సైంది.
ఈలోపే నగల మూట మాయమైందనే విషయం బయటకు వచ్చింది. వేలూరు రంగయ్య దంపతులు ఆలయ పూజారి ఎదుటే హుండీలో నగల మూట వేశారు. అయితే లెక్కించేటప్పుడు నగలమూట కనిపించకపోవటంతో నగలు మాయమయ్యాయనే విషయం బయటకు వచ్చింది. దీనికి తోడు పంపకాల సమయంలో తేడా రావటంతో.. ఏం చేయాలో పాలుపోక సిబ్బంది బుధవారం రాత్రి నగల మూటను తీసుకువచ్చి తిరిగి హుండీలో వేశారు. గురువారం ఆలయ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆలయ హుండీలో వేసిన నగల మూటను చోరీ చేసేందుకు యత్నించడంపై భక్తులు మండిపడుతున్నారు.ఈ ఘటనపై ఏపీ దేవాదాయశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పెన్నా నది ఒడ్డున కొలువై ఉంది. ఈ ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఐదు అడుగుల మూడు అంగుళాల లక్ష్మీ నరసింహస్వామి పాదముద్రపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏటా ఏప్రిల్ నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ ఆలయం వివాహ వేడుకలకు ప్రసిద్ధి చెందింది.

Share213Tweet133SendSend

Related Posts

T-Hubలో కల్వా హసిని‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం
Uncategorized

T-Hubలో కల్వా హసిని‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

హైదరాబాద్‌కు చెందిన గ్రాఫిక్ డిజైనర్ మరియు బీటెక్ విద్యార్థిని కల్వా హసిని, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI...

by Telugu World
March 26, 2025
T-Hubలో మురళీ క్రిష్ణ వల్లపురం కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం
Uncategorized

T-Hubలో మురళీ క్రిష్ణ వల్లపురం కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

విశాఖ పట్నం కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రిచ్ మైండ్స్ గ్రీన్ సొల్యుషన్స్ యజమాని మురళీ క్రిష్ణ వల్లపురం, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు...

by Telugu World
March 26, 2025
Next Post
వైఎస్ జగన్ మోసం చేశారు.. అందుకే రాజీనామా.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు

వైఎస్ జగన్ మోసం చేశారు.. అందుకే రాజీనామా.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

వెంకటపతి బి ఎమ్: క్రిప్టో నిపుణుడు, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

వెంకటపతి బి ఎమ్: క్రిప్టో నిపుణుడు, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

May 14, 2025
కతే పవన్ కుమార్ – సేవలో స్ఫూర్తి

కతే పవన్ కుమార్ – సేవలో స్ఫూర్తి

May 14, 2025
T-Hubలో భీమోజు ప్రశాంత్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో భీమోజు ప్రశాంత్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 13, 2025
T-Hubలో రమాకాంత్ వేములకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో రమాకాంత్ వేములకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 13, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.