సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి నడికొప్పుల సంపత్ కుమార్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేశారు. మే 25, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నేషనల్ హ్యాండ్రైటింగ్ అకాడమీ డైరెక్టర్ మల్లికార్జునరావు, ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ యోగా నారాయణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని నడికొప్పుల సంపత్ కుమార్కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా నడికొప్పుల సంపత్ కుమార్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ లో నేర్పిన AI టూల్స్ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ శిక్షణ నా భవిష్యత్ విద్యా లక్ష్యాలను సాధించడంలో, సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయడంలో మరియు ఆధునిక సాంకేతికతను అర్థం చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు. తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ జూన్ 9, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686.
టి-హబ్ లో ఘనంగా ముగిసిన యోగాసింధూర్ విజయోత్సవ సభ
జూన్ 22, 2025 – అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష మందికి పైగా ప్రజలు భాగస్వామ్యం చేసిన “యోగసింధూర్ – ఆరోగ్య భారత్ ఉద్యమం” విజయవంతంగా...