• Contact Us
Sunday, June 1, 2025
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన

Telugu World by Telugu World
March 20, 2025
in తెలంగాణ
Reading Time: 1 min read
0
వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన

Related Post

T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో రామన్ కోల్ రాహుల్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో ఉజ్వల ముత్యాలకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో నరేష్ కుమార్ బొలిశెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీగా బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని అన్నారు.

సూర్యాపేటలో జనాలను చూస్తే భారీ బహిరంగ సభకు వచ్చినట్లుగా ఉందని.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే అధికారమని కేటీఆర్ జోస్యం చెప్పారు. దేశంలో తెలుగువాళ్లు కూడా ఉన్నారని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చాటితే.. తెలంగాణ కూడా ఉందని కేసీఆర్ చాటారని అన్నారు. తెలుగు గడ్డపై పుట్టి దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన పార్టీలు టీడీపీ, బీఆర్ఎస్‌లేనని ఉద్ఘాటించారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మోకాళ్ల ఎత్తు కూడా లేని కొందరు శాసనసభలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ఎన్ని మాటలు చెప్పినా చరిత్ర మారదని, ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని వ్యాఖ్యానించారు. తొలి 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించామని.. తర్వాత పదేళ్లు తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించామని గుర్తుచేశారు.

‘‘ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సర్కారుకు చెమటలు పట్టిస్తున్నాం… ప్రజల తరఫున ప్రభుత్వంతో బీఆర్ఎస్ కొట్లాడుతుంది.. పార్టీ పని అయిపోయింది.. ఇక మూత పడతుందని అన్నారు.. కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొని నిలబడి పోరాడుతున్నాం.. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పర్సనాలిటీ పెంచుకుంటారనుకుంటే పర్సెంటేజీలు పెంచుకుంటున్నారు… కాంగ్రెస్ విష ప్రచారాలను నమ్మి బీఆర్ఎస్‌ను ప్రజలు ఓడించారు’ అని చెప్పారు. వాస్తవానికి పాదయాత్రపై గతేడాది నవంబరులోనే కేటీఆర్ తన మనసులో మాటను బయటపెట్టారు. ఆస్క్ కేటీఆర్ పేరిట ఎక్క్‌లో వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు.

Share213Tweet133SendSend

Related Posts

T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
తెలంగాణ

T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

జోగులాంబ గద్వాల్ జిల్లా, గట్టు మండలం, తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన మోటివేషనల్ స్పీకర్, ఎంట్రప్రెన్యూర్ మరియు రియల్ వర్సిటీ ఫౌండర్ ఇల్లూరు ఉరుకుందు శెట్టి, ప్రఖ్యాత AI...

by Telugu World
May 30, 2025
T-Hubలో రామన్ కోల్ రాహుల్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
తెలంగాణ

T-Hubలో రామన్ కోల్ రాహుల్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

సికింద్రాబాద్‌, ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన ఎంబీఏ విద్యార్థి రామన్ కోల్ రాహుల్ ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్...

by Telugu World
May 30, 2025
Next Post

Vande Bharat Sleeper Train రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్.. త్వరలో ఈ రూట్లలో ప్రారంభం..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

T-Hubలో నాగేశ్వర రావు తమ్మనబోయినకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో నాగేశ్వర రావు తమ్మనబోయినకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 30, 2025
T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 30, 2025
T-Hubలో రామన్ కోల్ రాహుల్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో రామన్ కోల్ రాహుల్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 30, 2025
T-Hubలో తమ్మలి విశ్వనాథ్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో తమ్మలి విశ్వనాథ్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 28, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.