Ambati Rambabu: గుంటూరులో జగన్ పిలుపుమేరకు యువతి పోరు కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని స్వామి థియేటర్ నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు వైసిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనీ కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య కొంత తోపులాట జరిగింది. అనంతరం వైసిపి నాయకులు విద్యార్థుల సమస్యలపై కలెక్టర్ నీ కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్బంగా యువతకు ఇచ్చిన హామీ ఒక్కటీ కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు నిరుద్యోగ బృతి ఊసే లేదన్నారు. వైసీపీ క్యాడర్ పై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.
పోసాని కృష్ణ మురళి 17 కేసులు పెట్టారని లోకేష్ డీజీపీకి ఫోన్ చేసి మరో కేసు పెట్టించారని ఆరోపణలు చేశారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడిపిస్తున్నారన్నారు. వీటన్నింటికి లోకేష్ త్వరలోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు.