కర్నూలులో ఘనంగా నిర్వహించిన హరి ఉదాన్ 2026 – ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 700 మందికి పైగా ఇంటర్ టాపర్లకు గోల్డ్ మెడల్స్, 4,000 మందికి పైగా హాజరు
విద్యార్థుల ప్రతిభను గుర్తించి, ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో హరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన “హరి ఉదాన్ 2026 – స్టేట్ మెరిట్ ఎక్సలెన్స్ అవార్డ్స్” కార్యక్రమం కర్నూలులో అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 700 మందికి పైగా ఇంటర్మీడియట్ ప్రతిభావంతులైన విద్యార్థులను గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు కలిసి 4,000 మందికి పైగా హాజరై విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు హాజరై విద్యార్థులను అభినందించారు. తన ప్రసంగంలో విద్య అనేది జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనమని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర అభ్యాసం విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయని పేర్కొన్నారు. నేటి యువత ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా డా. ఎన్. ఎల్. ఎన్. రెడ్డి, ప్రొఫెసర్ & డీన్, సీబీఐటీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, భవిష్యత్తు పోటీ ప్రపంచంలో కేవలం మార్కులు మాత్రమే కాకుండా కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, సాంకేతిక నైపుణ్యాలు కూడా సమానంగా అవసరమని తెలిపారు. విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమను తాము అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.
హరి యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డా. నర్సిరెడ్డి మల్గిరెడ్డి మాట్లాడుతూ, హరి యూనివర్సిటీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన, ఇన్నోవేషన్, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడం కోసం హరి ఉదాన్ వంటి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామచంద్ర మిషన్ జోనల్ డైరెక్టర్ రామాంజనేయులు, ప్రముఖ స్టడీ9 మీడియా వ్యవస్థాపకులు భూపెల్లి మహేష్, రంజిత్, ఏఐ నిపుణుడు సూపర్ ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు నికీలు గుండా పాల్గొని విద్యార్థులను అభినందించారు.
యువత తమ లక్ష్యాల పట్ల స్పష్టతతో ముందుకు సాగితే దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించగలరని వారు పేర్కొన్నారు. విద్యతో పాటు కృత్రిమ మేధస్సు (AI), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, వ్యక్తిత్వ వికాసంపై కూడా విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. యువత తమ లక్ష్యాల పట్ల స్పష్టతతో ముందుకు సాగితే దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించగలరని వారు పేర్కొన్నారు. విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, వ్యక్తిత్వ వికాసంపై కూడా విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు.

కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయడంతో పాటు ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలు, మెరిట్ స్కాలర్షిప్లపై ప్రత్యేక అవగాహన కల్పించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా స్వాగతించి, హరి యూనివర్సిటీ చేపట్టిన ఈ విద్యా ప్రోత్సాహక కార్యక్రమాన్ని అభినందించారు.
హరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హరి ఉదాన్ 2026 కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను గౌరవించడమే కాకుండా, వారికి ఉన్నత విద్యపై నూతన ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఒక స్ఫూర్తిదాయక వేదికగా నిలిచింది.







