సోమాజిగూడకు చెందిన బైసాని ధనుంజయ గుప్త, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్గా, ఫైనాన్షియల్ గోల్స్ ప్లానర్గా మరియు ఇన్సురెన్స్ అడ్వైసర్ గా విజయవంతంగా కొనసాగుతున్న ఆయన ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు, 8fx వ్యవస్థాపకుడు కరన్ షా, ముఖ్య అతిథులుగా పాల్గొని బైసాని ధనుంజయ గుప్తకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా బైసాని ధనుంజయ గుప్త మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది. AI టూల్స్ను ప్రాక్టికల్గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ వృత్తిలో నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్కు, నికీలు గుండ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్గా ఎన్నిక
హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా...