IPL 2025లో ఒక విచిత్రమైన దృశ్యం… ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ, ఇంకా క్రీజ్లో ఉన్నప్పుడే, బ్యాట్ విసిరేసి బయటకి వచ్చేశాడు! అవును… ఇది ఔట్ కాదు, ఇది రిటైర్ అవుట్!

అది ముంబై టీమ్ మేనేజ్మెంట్ వ్యూహమే. కానీ అది చూసిన సూర్యకుమార్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. అతని ముఖంలోనే అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. డగౌట్లో కూర్చొన్న SKY, “ఏం జరుగు తుందీ?” అన్నట్లుగా చూసాడు. చివరికి కోచ్ జయవర్ధనే వచ్చి అతన్ని శాంతింపజేయాల్సి వచ్చింది!
తిలక్ వర్మ అప్పటివరకు 23 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. చివరి ఓవర్లు మిగిలి ఉండటంతో, పెద్ద షాట్లు కొట్టగల ఆటగాడిని పంపించాలని కోచ్లు భావించారు. వెంటనే మిచెల్ శాంట్నర్ను పంపించారు. ఇది పూర్తిగా ఒక వ్యూహాత్మక నిర్ణయమే కానీ… అది చర్చకు దారితీసింది.
ఈ విషయమై భారత క్రికెట్ దిగ్గజాలు ఈ విధంగా స్పందించారు..
హర్భజన్ సింగ్ గారు ఘాటుగా స్పందించారు
“ఇలా తిలక్ వర్మను తీసేసేంత తప్పేమైనా చేశాడా?”
ఇర్ఫాన్ పఠాన్ కూడా ప్రశ్నించారు:
“మిడిల్ ఆర్డర్లో కుదురుగా ఆడే ఆటగాడు తిలక్. ఆ స్థితిలో అతన్ని రిటైర్ అవుట్ చేయడం అన్యాయమే.”