వరంగల్ కు చెందిన హార్డ్వేర్ ఇంజినీర్ మరియు వెబ్ డిజైనర్ అయిన గుడిపాక జయకర్, ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని గుడిపాక జయకర్కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా గుడిపాక జయకర్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా హార్డ్వేర్ ఇంజినీరింగ్ మరియు వెబ్ డిజైనింగ్ నైపుణ్యాలలో సాంకేతిక ఆవిష్కరణలను అన్వయించే కొత్త మార్గాలను చూపించింది. AI టూల్స్ను ప్రాక్టికల్గా ఉపయోగించడం ద్వారా నా డిజిమైండ్స్ హబ్ సంస్థలో సమర్థవంతమైన సాంకేతిక పరిష్కారాలను అందించే సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఈ శిక్షణ నా వృత్తిలో వినూత్న సేవలను అందించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు. తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1, 2025 నుండి ప్రారంభం కానుంది.
T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
జోగులాంబ గద్వాల్ జిల్లా, గట్టు మండలం, తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన మోటివేషనల్ స్పీకర్, ఎంట్రప్రెన్యూర్ మరియు రియల్ వర్సిటీ ఫౌండర్ ఇల్లూరు ఉరుకుందు శెట్టి, ప్రఖ్యాత AI...