ప్రముఖ మానసిక నిపుణుడు సుధీర్ సండ్ర ఇటీవల గురువులపై గౌరవం తగ్గిపోతున్న పరిస్థితిపై సోషల్ మీడియాలో స్పందించారు. ఒకప్పుడు “గురుదేవోభవ” అనే మాటకు గొప్ప విలువ ఉండేది. తల్లిదండ్రుల తర్వాత గురువును దేవుడిగా భావించే సంప్రదాయం మనలో ఉండేది. కానీ నేటి విద్యార్థులు గురువులను గౌరవిస్తున్నారా? లేక అవమానిస్తున్నారా?

ఇప్పట్లో గురువులను అవమానించడం, క్లాస్లో కామెంట్లు వేయడం, ఎదిరించడం సాధారణమైపోయింది. గతంలో గురువు మందలిస్తే తల్లిదండ్రులు పిల్లల తప్పే అని చెప్తూ మరింత గౌరవం నేర్పేవారు. కానీ ఇప్పుడు గురువులను అవమానిస్తే “హీరోలా” అనుకునే పరిస్థితి వచ్చింది.
ఈ మార్పుపై సుధీర్ సండ్ర గారు తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే పిల్లలకు గురువుల గౌరవాన్ని నేర్పాలని, విద్యార్థులు ఉపాధ్యాయుల మాటలను గౌరవంతో వినాలని, సమాజం దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
గురువులను గౌరవించడం అంటే భవిష్యత్తును గౌరవించడం!
ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి – మార్పు మన చేతుల్లోనే ఉంది!