• Contact Us
Saturday, May 24, 2025
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. అంత ప్రత్యేకత ఏముందో చూశారా?

Telugu World by Telugu World
March 20, 2025
in అంతర్జాతీయ
Reading Time: 1 min read
0
వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. అంత ప్రత్యేకత ఏముందో చూశారా?

MF Hussain Painting Sells 13.8 Million Dollars: 1950ల నాటి ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ అరుదైన రికార్డును సృష్టించింది. ముఖ్యంగా ఎంఎఫ్ హుస్సనే పెయింటింగ్‌లలో అత్యంత గణనీయమైన, ముఖ్యమైన పెయింటింగ్‌గా పేరొందిన అన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర) ఏకంగా 118 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో.. ఈ పెయింటింగ్‌ను 13.8 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షెర్గిల్ 1937లో వేసిన “ది స్టోరీ టెల్లర్” పెయింటింగ్‌ను 2023లో ముంబయిలో వేలం వేయగా ఎవరూ ఊహించని ధరకు అమ్ముడుపోయింది. ముఖ్యంగా 7.4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.61.8 కోట్లు) పెట్టి ఒకరు దాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా రికార్డులో ఉంది. అయితే తాజాగా దీన్ని వెనక్కి నెడుతూ.. ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ రికార్డు సృష్టించింది. గతంలో రికార్డులో ఉన్న ధర కంటే రెండు రెట్లు ఎక్కువకు అమ్ముడు పోయింది.


ఎంఎఫ్ హుస్సేన్ కుంచె నుంచి జాలువారిన ఈ గ్రామ్ యాత్రను దాదాపు 14 అడుగుల విస్తీర్ణంలో వేశారు. ఒకే కాన్వాస్‌లో మొత్తంగా 13 ప్రత్యేకమైన చిత్రాలతో రూపొందించారు. అయితే దీన్ని తాజాగా ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్‌లో వేలం వేసింది. ఈక్రమంలోనే దీన్ని 13.8 మిలియన్ల డాలర్లు పెట్టి కొనుగోలు చేశారు. దీంతో సదరు సంస్థ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ అద్భుత కళాఖండం కొత్త రికార్డు సృష్టిండంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని క్రిస్టీస్ సౌత్ ఏషియన్ మోడ్రన్ అండ్ కాంటెంపరరీ ఆర్ట్ అధిపతి నిషాద్ అవారి తెలిపారు.
1954వ సంవత్సరంలో భారత దేశాన్ని వదిలి వెళ్లింది ఈ పెయింటింగ్. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో జన్మించిన నార్వేకు చెందిన వైద్యుడు లియోన్ ఎలియాస్ వోలోడార్స్కీ దీన్ని కొనుగోలు చేశారు. ఇక అప్పటి నుంచి ఎక్కడా పెద్దగా ఈ పెయింటింగ్ కనిపించలేదు. అయితే ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ కోసం థోరాసిక్ సర్జరీ శిక్షణా కేంద్రాన్ని స్థాపించేందుకు ఢిల్లీకి వచ్చారు. ఈక్రమంలోనే 1964లో వోలోడార్స్కీ ఈ పెయింటింగ్‌ను ఓస్లో యూనివర్సిటీ ఆసుపత్రికి అందజేశారు. అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సంస్థలో భవిష్యత్ తరాల వైద్యుల శిక్షణకు తోడ్పడుతుందని కూడా వెల్లడించారు.

అయితే గతేడాది లండన్‌లో నిర్వహించిన వేళంలో 3.1 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం రూ.25.7 కోట్లకు) ఈ పెయింటింగ్ అమ్ముడు పోయింది. ఒక్క సంవత్సరంలోనే తిరగి దీన్ని వేలంలో పెట్టగా రికార్డు ధర పలికింది.

Related Post

తెలుగు AI బూట్ క్యాంప్ గ్రాడ్యుయేషన్ – సుజాత మాదాల‌కు పట్టా ప్రదానం

ఫ్రాన్స్‌లో ప్రదర్శన సమయంలో గాల్లోనే ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు

మీ వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ రావడానికి సిద్ధమవుతోంది… ముందే తెలుసుకోండి!

ఫుల్లుగా తాగి కారు డ్రైవ్ చేసిన మేయర్.. రెండేళ్ల బిడ్డ పక్కనే ఉన్నా ఏమీ పట్టనట్టుగా..!

Share214Tweet134SendSend

Related Posts

తెలుగు AI బూట్ క్యాంప్ గ్రాడ్యుయేషన్ – సుజాత మాదాల‌కు పట్టా ప్రదానం
తెలంగాణ

తెలుగు AI బూట్ క్యాంప్ గ్రాడ్యుయేషన్ – సుజాత మాదాల‌కు పట్టా ప్రదానం

టొరంటో, కెనడా కు చెందిన సుజాత మాదాల, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా...

by Telugu World
March 26, 2025
ఫ్రాన్స్‌లో ప్రదర్శన సమయంలో గాల్లోనే ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు
అంతర్జాతీయ

ఫ్రాన్స్‌లో ప్రదర్శన సమయంలో గాల్లోనే ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు

ఫ్రాన్స్‌ వైమానిక దళానికి చెందిన పట్రూయిల్‌ డి ఫ్రాన్స్‌ (Patrouille de France) ఏరోబాటిక్‌ టీమ్‌కి చెందిన రెండు ఆల్ఫా జెట్‌ విమానాలు ప్రదర్శన సమయంలో గాల్లోనే...

by Telugu World
March 26, 2025
Next Post
IPL టైటిల్ కోసం పంజాబ్ పూజ.. రికీ పాంటింగ్‌ని కూడా కూర్చోబెట్టారుగా!

IPL టైటిల్ కోసం పంజాబ్ పూజ.. రికీ పాంటింగ్‌ని కూడా కూర్చోబెట్టారుగా!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

కాలేజ్ డ్రాపౌట్ నుంచి డిజిటల్ రివల్యూషనరీ: నవీన్ గోగు అసాధారణ ప్రయాణం

కాలేజ్ డ్రాపౌట్ నుంచి డిజిటల్ రివల్యూషనరీ: నవీన్ గోగు అసాధారణ ప్రయాణం

May 20, 2025
T-Hubలో అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 16, 2025
T-Hubలో గుడిపాక జయకర్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో గుడిపాక జయకర్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 16, 2025
వెంకటపతి బి ఎమ్: క్రిప్టో నిపుణుడు, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

వెంకటపతి బి ఎమ్: క్రిప్టో నిపుణుడు, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

May 14, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.