విశాఖ పట్నం కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రిచ్ మైండ్స్ గ్రీన్ సొల్యుషన్స్ యజమాని మురళీ క్రిష్ణ వల్లపురం, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని మురళీ క్రిష్ణ వల్లపురం కు పట్టా అందజేశారు.
మురళీ క్రిష్ణ వల్లపురం మాట్లాడుతూ, “శ్రీ నికీలు గుండ గారు తెలుగు AI బూట్ క్యాంప్లో నేర్పించిన టూల్స్, టెక్నిక్స్, బంధాలు, అనుబంధాలు, మన వ్యక్తిత్వ వికాసానికి ఎంత ఉపయోగపడతాయో తెలిపే విధానం అమోఘం. మారుతున్న కాలంతో పాటు మనం ఎలా అభివృద్ధి చెందాలో, డబ్బును ఎలా సంపాదించాలో, వ్యాపారాన్ని ఎలా స్థాపించుకోవాలో, విజయం సాధించడానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలో స్పష్టంగా తెలియజేశారు. ఈ బూట్ క్యాంప్ ద్వారా నేర్చుకున్న విషయాలు భవిష్యత్తులో నాకు గొప్ప మార్గదర్శకంగా మారతాయి. మీ ప్రోత్సాహానికి, మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని తెలిపారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1న ప్రారంభంకానుంది.