పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన AI ఇన్నోవేషన్ హబ్ వ్యవస్థాపకులు, AI స్కిల్స్ మెంటర్ మరియు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ మురళీకృష్ణ కేశబోయిన, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండాల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ కేఫ్ వ్యవస్థాపకుడు బాబూరావు, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు, AI మెంటర్ నికీలు గుండాలు ముఖ్య అతిథులుగా పాల్గొని మురళీకృష్ణ కేశబోయినకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా మురళీకృష్ణ కేశబోయిన మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి మరియు మెంటరింగ్ జీవితంలో కొత్త దిశను చూపింది. AI టూల్స్ను ప్రాక్టికల్గా ఉపయోగించడం ద్వారా నా టెక్నికల్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా AI ఇన్నోవేషన్ హబ్లో సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తుందని ధీమాగా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్కు, నికీలు గుండాలకు హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తెలుగు AI బూట్ క్యాంప్ యొక్క తదుపరి బ్యాచ్ మే 1, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా యువత, వ్యాపారవేత్తలు, మెంటర్లు AI టెక్నాలజీలో నైపుణ్యం సాధించే అవకాశం పొందవచ్చు.