ఇబ్రహీంపట్నంకు చెందిన, ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న షైక్ జహీర్ ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని షైక్ జహీర్కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా షైక్ జహీర్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా సాంకేతిక జ్ఞానంలో కొత్త ఒరవడిని సృష్టించింది. AI టూల్స్ను ప్రాక్టికల్గా ఉపయోగించడం ద్వారా నా నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ జూన్ 1 వ తారీఖు నుండి మొదలవ్వనుంది.
T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
జోగులాంబ గద్వాల్ జిల్లా, గట్టు మండలం, తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన మోటివేషనల్ స్పీకర్, ఎంట్రప్రెన్యూర్ మరియు రియల్ వర్సిటీ ఫౌండర్ ఇల్లూరు ఉరుకుందు శెట్టి, ప్రఖ్యాత AI...