Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ఉదయం కాసేపు ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత స్థిరంగా లాభాలు కొనసాగాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఇంధన, మెటల్ స్టాక్స్లో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 609 పాయింట్ల లాభంతో 74వేల340 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు పెరిగి 22వేల 544 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 87.12 వద్ద ముగిసింది.