జార్జ్టౌన్, టెక్సాస్:
ఆనందం, ఆధ్యాత్మికత, సంగీతం, సంస్కృతి… ఇవన్నీ ఒక్క చోటుకొచ్చే పర్వదినం ఉగాది. శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని, జార్జ్టౌన్లోని హరి హర క్షేత్రం దేవస్థానంలో మార్చి 30, 2025 (ఆదివారం)న సాయంత్రం 4:30 గంటల నుండి 8:30 వరకు ఉగాది ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి హరి హర క్షేత్రం చైర్మన్ డా. భరత్ కుమార్ కక్కిరేని గారు నేతృత్వం వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, మానసిక నిపుణుడు సుధీర్ సండ్ర గారు హాజరవుతున్నారు. ఉత్సవాన్ని మరింత భక్తిమయంగా మార్చేందుకు ప్రముఖ గాయని శృతిరెడ్డి.ఆర్ సంగీత వినోదంతో సందడి చేయనున్నారు.
సాంప్రదాయానికి అనుగుణంగా, పంచాంగ శ్రవణం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. దీని కోసం ప్రసిద్ధ పండితుడు మణికంఠ, కొల్లూరు గారు హాజరై నూతన సంవత్సర రాశిఫలితాలు, ముహూర్తాలపై జ్యోతిష్య ప్రకటనలు చేస్తారు.
ఈ కార్యక్రమాన్ని AEC Event Centers విజయవంతంగా నిర్వహించనుండగా, SBA Tax Consultants స్పాన్సర్గా ముందుకు వచ్చారు.
ఈవెంట్ వివరాలు:
తేదీ: మార్చి 30, 2025
సమయం: సాయంత్రం 4:30 నుండి 8:30 వరకు
స్థలం: హరి హర క్షేత్రం దేవస్థానం, జార్జ్టౌన్, TX
టికెట్ల కోసం: Eventbrite ద్వారా బుక్ చేసుకోవచ్చు
ఈ ఉగాది వేడుకలు వేదికగా భారతీయ సంప్రదాయాలను పునరుజ్జీవింపజేస్తూ, మనం ఏ దేశంలో ఉన్నా మన సంస్కృతిని గౌరవించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరుతున్నారు.