హైదరాబాద్ కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని, Ozone Run & Foodiet వ్యవస్థాపకురాలు తీర్థ వున్నం, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు, ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని తీర్థ వున్నంకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా తీర్థ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా విద్యా మరియు వృత్తి జీవితంలో కొత్త దిశను చూపింది. AI టూల్స్ను ప్రాక్టికల్గా నేర్చుకోవడం ద్వారా నా టెక్నికల్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ భవిష్యత్తులో నా చదువులో, కెరీర్లో, మరియు నా వ్యాపార సంస్థ అభివృద్ధిలో కొత్త అవకాశాలను తెరుస్తుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన నికీలు గుండ సర్కి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తెలుగు AI బూట్ క్యాంప్ యొక్క తదుపరి బ్యాచ్ మే 1, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా యువత, విద్యార్థులు, మరియు ఔత్సాహిక వ్యవస్థాపకులు AI టెక్నాలజీలో నైపుణ్యం సాధించే అవకాశం పొందవచ్చు.
T-Hubలో ఇల్లూరు ఉరుకుందు శెట్టికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
జోగులాంబ గద్వాల్ జిల్లా, గట్టు మండలం, తప్పెట్లమొర్సు గ్రామానికి చెందిన మోటివేషనల్ స్పీకర్, ఎంట్రప్రెన్యూర్ మరియు రియల్ వర్సిటీ ఫౌండర్ ఇల్లూరు ఉరుకుందు శెట్టి, ప్రఖ్యాత AI...