విజయవాడకు చెందిన సత్య మణికంఠ, అడ్వకేట్గా విజయవంతంగా రాణిస్తున్నారు. ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని సత్య మణికంఠకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా సత్య మణికంఠ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి జీవితంలో కొత్త దిశను చూపింది. AI టూల్స్ను ప్రాక్టికల్గా ఉపయోగించడం ద్వారా నా టెక్నికల్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా వృత్తిలో సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తుందని ధీమాగా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు. తెలుగు AI బూట్ క్యాంప్ యొక్క తదుపరి బ్యాచ్ మే 1, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా యువత, వ్యాపారవేత్తలు AI టెక్నాలజీలో నైపుణ్యం సాధించే అవకాశం పొందవచ్చు
T-Hubలో నాగేశ్వర రావు తమ్మనబోయినకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రొఫెషనల్ హిప్నోథెరపిస్ట్ మరియు డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారవేత్త నాగేశ్వర రావు తమ్మనబోయిన, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో...