కుకట్పల్లికి చెందిన దుర్గాభవాని, లైఫ్ ఇన్సురెన్స్ ఏజెంట్గా, ఉజ్వల న్యూస్ ఇంచార్జ్గా విజయవంతంగా రాణిస్తున్నారు. ఇటీవల ప్రఖ్యాత AI మె ప్రోగ్రామ్లో నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని దుర్గాభవానికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా దుర్గాభవాని మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా వృత్తి జీవితంలో కొత్త ఒరవడిని సృష్టించింది. AI టూల్స్ను ప్రాక్టికల్గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా పెరిగాయి. ఈ శిక్షణ నా ఇన్సురెన్స్ మరియు న్యూస్ సంస్థలలో నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుందని ఆశాభావంతో ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు!” అని తెలిపారు. తెలుగు AI బూట్ క్యాంప్ యొక్క తదుపరి బ్యాచ్ మే 1, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా యువత, వ్యాపారవేత్తలు AI టెక్నాలజీలో నైపుణ్యం సాధించే అవకాశం పొందవచ్చు
టి-హబ్ లో ఘనంగా ముగిసిన యోగాసింధూర్ విజయోత్సవ సభ
జూన్ 22, 2025 – అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష మందికి పైగా ప్రజలు భాగస్వామ్యం చేసిన “యోగసింధూర్ – ఆరోగ్య భారత్ ఉద్యమం” విజయవంతంగా...