ఐపీఎల్ 2025 సీజన్లో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్లో రిషభ్ పంత్తో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తీసుకున్న ‘క్లాస్’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ అనంతరం మైదానంలోనే పంత్ను పక్కకు తీసుకెళ్లి, తన అభిప్రాయం తెలుపుతూ జట్టు ఓటమికి గల కారణాలను వేలెత్తి చూపాడు, ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు — “మళ్లీ ఇదేనా?” అని విసుగుతో స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇదే తరహా సంఘటన గతంలో KL రాహుల్ పట్లనూ జరిగింది. ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమిపాలైనప్పుడు గోయెంకా, రాహుల్ను కూడా బహిరంగంగానే క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు అదే పంత్తో జరగడం బాధాకరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఫలితంగా, “ఓటమి జట్టుకంతటికి చెందాలి, ఒకరి మీదే ఒత్తిడి ఎందుకు?” అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. టీమ్లో సహకారం, నమ్మకం, కెప్టెన్పై ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే పెద్ద విజయాలు సాధ్యమవుతాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.