Bandi Sanjay: తెలంగాణ సీఎం రేవంత్ పాలనపై కేంద్రమంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. అన్నదాతల ఆక్రందనలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. 10 లక్షల ఎకరా ల్లో పంటలు ఎండినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల్లో నీళ్లున్నా ఎందుకు వదలడం లేదంటూ కాంగ్రెస్ నేతలను బండి సంజయ్ క్వశ్చన్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతులు మూల్యం చెల్లించాలా అంటూ నిలదీశారు.
నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్న బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వ తప్పుని కేంద్రంపై నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా ఇవ్వరు.. రుణమాఫీ పూర్తిచేయరు. చివరకు పంట నష్టపరిహారం ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.
ఇదేనా కాంగ్రెస్ మార్క్ రైతు సంక్షేమ రాజ్యమంటూ నిలదీశారు. రైతు సమస్యలపై వెంటనే అసెంబ్లీలో చర్చించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు సంజయ్. యాసంగి పూర్తయ్యే వరకు నీళ్లు వదలాలంటూ డిమాండ్ చేశారు.