వేడినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెబుతారు. ముఖ్యంగా ఆహారం తిన్న వెంటనే వేడి నీళ్లు తాగితే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయని కొంతమంది నమ్ముతుంటారు. నిజంగా ఇది పనిచేస్తుందా? అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి మేం వైద్య నిపుణులను అడిగాం.
వాళ్లు ఏమంటున్నరంటే – వేడి నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి కావలసిన పోషకాలు బాగా గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే, కొంతవరకు గ్లూకోజ్ శోషణను మందగించొచ్చు. కానీ, ఇది షుగర్ తగ్గించేందుకు సరిపోదు. అసలైన పరిష్కారం మంచి ఆహారం, వ్యాయామం, మందులనే అని వాళ్లు చెప్తున్నారు.
మొత్తానికి చెప్పాలంటే… వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ, షుగర్ లెవల్స్ తగ్గాలంటే మనం ఆహారం, వ్యాయామం, వైద్యుల సూచనలపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యానికి అపోహలు కాకుండా, నిజమైన సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం.