ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి ఆకట్టుకుంది. ముంబై ఇండియన్స్ (MI) పై 12 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన అనంతరం విరాట్ కోహ్లీ చేసిన సంబరాలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మ్యాచ్ గెలిచిన వెంటనే కోహ్లీ తన ఉత్కంఠను మరిచి మైదానంలో ఎగిరిపడ్డాడు. ఆయన చేసే ఎనర్జిటిక్ సెలబ్రేషన్లు అభిమానులను ఉర్రూతలూగించాయి.
వైరల్ వీడియో:
కోహ్లీ మైదానంలో గట్టిగా అరవడం, తన చేతులను పైకి ఎత్తి ఫ్యాన్స్ను ఉత్సాహపరచడం కనిపించింది. రోహిత్, పాండ్య బాదలో ఉండడం కోహ్లీ కేరింతలు కొట్టడం రెండూ ఒకే సారి రికార్డయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
RCB ఆకర్షణ కొనసాగుతోంది:
ఈ విజయం ద్వారా RCB టోర్నమెంట్లో బలంగా నిలుస్తోంది. రజిత్ పటిధార్ నాయకత్వం లో దూసుకుపోతూ, ఆత్మవిశ్వాసంతో జట్టు పుంజుకుంటోంది. MIపై ఈ గెలుపు, వాంఖడేలో 10 ఏళ్ల తర్వాత RCB సొంతంగా నమోదుచేసిన ఓ మైలు రాయి కావడం విశేషం.