ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టుకోసం తన వ్యక్తిగత శతకాన్ని త్యాగం చేశారు. 42 బంతుల్లో 97 పరుగులు చేసిన అయ్యర్, కేవలం మూడు పరుగుల దూరంలో శతకానికి చేరలేకపోయారు.
చివరి ఓవర్లో శశాంక్ సింగ్ స్ట్రైక్లో ఉన్న సమయంలో, శ్రేయస్ ఆయన్ని స్వేచ్ఛగా ఆడమని ప్రోత్సహించారు. “జట్టు గెలుపు కోసం పరుగులు చాలా ముఖ్యం నా సెంచరీ గురించి ఆలోచించకు నువ్వు బౌండరీలు కొట్టు అని సైగలు చేసాడు”

ఈ అసాధారణ నాయకత్వ గుణాలు చూపిన శ్రేయస్ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. శశాంక్ ఆఖరి ఓవర్లో 5 ఫోర్లు బాది, పంజాబ్ స్కోర్ను 243/5కి చేర్చాడు.
ఈ భారీ టార్గెట్ను కాపాడుకుంటూ పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ శతకాన్ని త్యాగం చేసినా, జట్టు విజయాన్ని అందుకోవడంలో ఆయన పాత్ర అపారంగా నిలిచింది.
నాయకత్వం అంటే పర్సనల్ రికార్డ్స్ను పక్కనపెట్టి, జట్టు విజయం కోసం ముందడుగు వేయడమే – ఇక నుంచి శ్రేయస్ దీనికి చిరునామాగా నిలిచిపోనున్నాడు!