మంచిర్యాల: విద్య, సేవ, క్రీడలు, నాయకత్వం –ఇన్ని రంగాల్లో కేవలం ఒక్క వ్యక్తే ఉన్నత స్థాయిలో రాణించడం సాధ్యమయ్యే పనేనా ? అవును, జెసి డా. రాజు అరుముల్లా అలాంటి వ్యక్తే! సివిల్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసిన ఆయన, అసిస్టెంట్ ప్రొఫెసర్గా విద్యార్థులకు జ్ఞానం పంచారు.
డా. రాజు ఒకవైపు టీచర్గా ఉంటూనే, జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ (JCI) మంచిర్యాల్ అధ్యక్షుడిగా సమాజ సేవలో జోరు చూపిస్తున్నారు. అంజని పుత్రా రియల్ ఎస్టేట్ కంపెనీలో సీజీఎం (చీఫ్ జనరల్ మేనేజర్)గా బిజినెస్ రంగంలోనూ తన సత్తా చూపిస్తున్నారు.
సమాజం కోసం ఆయన చేస్తున్న పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గ్రామాల్లో రక్తదాన క్యాంపులు, అవయవ దానం గొప్పతనం గురించి అందరికీ వివరిస్తూ అవగాహన తీసుకురావడం, పాఠశాలలకు పుస్తకాలు ఇవ్వడం – ఇలా అనేక సేవలతో ఎందరో జీవితాల్లో వెలుగు నింపారు. ఆయనే స్వయంగా 35 సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
క్రీడల్లోనూ డా. రాజు తక్కువేం కాదు! జాతీయ స్థాయి బాక్సర్గా పేరు తెచ్చుకున్న ఆయన, చాలామంది యువకులకు బాక్సింగ్ నేర్పి, వాళ్ల కలలకు బాట వేశారు. విద్యా రంగంలో కూడా ఆయన చాలా పరిశోధనలు చేసి, పేపర్లు రాసి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఆయన పనులకు గుర్తింపుగా ‘బెస్ట్ లీడర్షిప్ అవార్డ్’, ‘విశిష్ట ప్రతిభా రత్న అవార్డ్’, ‘నేషనల్ సేవారత్న అవార్డ్’ లాంటి గొప్ప అవార్డులు వచ్చాయి.
మోటివేషనల్ స్పీకర్గా యువతకు స్ఫూర్తినిచ్చే ఆయన, “మీ లక్ష్యాలను వదులుకోవద్దు” అని చెబుతూ ఎందరినో ఉత్తేజపరుస్తున్నారు. సేవ, నాయకత్వం, స్ఫూర్తి – ఈ మూడూ కలిసిన వ్యక్తి డా. రాజు.
జెసి డా. రాజు అరుముల్లా కేవలం ఒక వ్యక్తి కాదు – సమాజంలో మంచి మార్పులు తెచ్చే ఒక గొప్ప శక్తి. ఆయన స్ఫూర్తితో మనం కూడా సమాజానికి మంచి చేసే దారిలో అడుగు వేద్దాం!
Exllent madam 🙏