సంగారెడ్డి జిల్లా, గడ్డపోతారం గ్రామానికి చెందిన మద్దూరి మురళీకృష్ణ, ఇటీవల ప్రఖ్యాత తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తిచేసి, AI గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రముఖ మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు
మార్చి 9న హైదరాబాద్లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్ఎస్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని మురళీకృష్ణకు పట్టాను అందజేశారు.
ఈ 22 రోజుల శిక్షణలో AI టూల్స్ వినియోగం, వ్యాపార అభివృద్ధిలో AI పాత్ర, ఇంటి వద్ద ఉపాధి అవకాశాల సృష్టి, క్రియేటివ్ డిజైన్, వీడియో ఎడిటింగ్, వెబ్ డెవలప్మెంట్ వంటి అనేక అంశాలపై లోతైన శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ,
“AI ద్వారా భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ శిక్షణ నాకు కొత్త దారులు తెరిచింది. ఇంట్లో నుంచే ఉపాధిని పొందడమేకాక, వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా స్పష్టత ఇచ్చింది” అని తన అనుభవాన్ని పంచుకున్నారు.
తదుపరి తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది.