ఒడిశాలోని రెవెన్యూ విభాగంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సుధాకర్ రావు ఉమరవిల్లి, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తిచేశారు.

మార్చి 9న T-Hub, హైదరాబాద్లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ గారు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని సుధాకర్ రావు ఉమరవిల్లికి AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
సుధాకర్ రావు ఉమరవిల్లి మాట్లాడుతూ,
“ఈ తెలుగు AI బూట్ క్యాంప్ ద్వారా నేను డేటా అనాలిటిక్స్, ఆటోమేషన్, మరియు AI ఆధారిత పరిష్కారాల గురించి అద్భుతమైన అవగాహన పొందాను. ప్రభుత్వ పరిపాలనలో AI ఎలా ఉపయోగపడుతుందో నేర్చుకోవడం నాకు గొప్ప అనుభూతినిచ్చింది. కొద్దిపాటి సమయంతోనే ఎంతో విలువైన టెక్నాలజీ స్కిల్స్ నేర్చుకున్నాను.” అని అన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.