సుచిత్ర, హైదరాబాద్ కు చెందినప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్ & ఫోటోగ్రాఫర్ అయిన నన్నా నరసింహ స్వామి, ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్ విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న, T-Hub, హైదరాబాద్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వర్ రావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని నన్నా నరసింహ స్వామి కి పట్టా అందజేశారు.
ఈ 21-రోజుల బూట్ క్యాంప్ లో AI టూల్స్, వ్యాపార అభివృద్ధి, క్రియేటివ్ డిజైన్, వెబ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ వంటి అంశాల్లో లోతుగా శిక్షణ పొందారు.
AI బూట్ క్యాంప్ అనుభవాన్ని పంచుకుంటూ నన్నా నరసింహ స్వామి మాట్లాడుతూ,
“AI టూల్స్ తో పాటు, బిజినెస్ ఏ విధంగా చేసుకోవాలి, ఒకరితో ఒకరు ఎలా కలిసి ఉండాలి అనే విషయాలను మాకు చాలా బాగా చెప్పారు. నేను నా బిజినెస్ను మెరుగుపరచుకోవడానికి కూడా ఈ బూట్ క్యాంప్ ఎంతో ఉపయోగపడింది.” అని తెలిపారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1న ప్రారంభంకానుంది.