Nitin Gadkari: రోడ్డు ప్రమాదాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సివిల్ ఇంజినీర్లు, కన్సల్టెంట్ల తప్పిదాల వల్లే దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. దేశంలో అధ్వానమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేస్తున్నారని విమర్శించారు.
వాటి ప్రణాళిక, రూపకల్పన సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. సివిల్ ఇంజినీర్లు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాల వల్లే దేశంలో చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
లోపాలతో కూడిన డీపీఆర్ అందించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు చెప్పారు. వీటికి ఎవరూ బాధ్యత వహించడం లేదని, ముఖ్యంగా రోడ్డు సిగ్నల్స్, మార్కింగ్ సిస్టం ఏమాత్రం బాగా లేదన్నారు. చిన్న చిన్న పనులను కూడా సక్రమంగా నిర్వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ రోడ్ ఇన్ఫ్రాటెక్ సమ్మిట్ అండ్ ఎక్స్పో కార్యక్రమంలో నితిన్ పాల్గొన్నారు.