విశాఖపట్నానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రమణమూర్తి ధర్మాన, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండా, BNS శ్రీనివాస్ పాల్గొని రమణమూర్తి ధర్మానకు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
ఈ సందర్భంగా రమణమూర్తి ధర్మాన మాట్లాడుతూ,
“తెలుగు AI బూట్ క్యాంప్ నా కెరీర్లో ఎంతో స్పష్టత, నూతన ఆలోచనలు తీసుకొచ్చింది. AI టూల్స్ను నేర్చుకోవడం, వాటిని ఉపయోగించడం ద్వారా నా ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. ఈ విలువైన శిక్షణకు కారణమైన గ్రోత్ క్లబ్ టీమ్కు, ప్రత్యేకించి మెంటర్ నికీలు గుండా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు!” అని అన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.