ఐపీఎల్ 2025లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్, వరుసగా మూడో ఓటమితో అభిమానులను నిరాశపరిచింది. టాలెంట్తో నిండిన ఆరెంజ్ ఆర్మీ, మరోసారి ఆటలో సమిష్టిగా విఫలమై ఓటముల హ్యాట్రిక్ను నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో భారీగా – 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ ఓటమితో SRH పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు (6 వికెట్లు) కొట్టింది. వెంకటేష్ అయ్యర్ – కేవలం 29 బంతుల్లో 60 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అజింక్య రహానే (38), రఘువంశీ (50), రింకూ సింగ్ (32) కూడా కీలక పాత్ర వహించారు. సన్రైజర్స్ బౌలింగ్ పట్ల KKR బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం కనబరిచారు.
సన్రైజర్స్ బౌలింగ్ విభాగంలో షమీ, కమిన్స్, అన్సారీ, హర్షల్ పటేల్, మెండిస్ తలా ఒక్కో వికెట్ మాత్రమే తీశారు. అయితే, స్కోరు కంట్రోల్ చేయడంలో వారంతా విఫలమయ్యారు. SRH టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగినా… ఇప్పటివరకు ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చూపలేకపోతుండటం కలవరం కలిగిస్తోంది.