Thirumala: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. తిరుమల కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని సీబీఐ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇంటి దొంగల హస్తం ఉండటంతో కేసును ఏసీబీకి బదిలీ చేయాలని సీబీఐ సిట్ కోరింది. నెయ్యి సరఫరా టెండర్ల వ్యవహారంలో నగదు అక్రమ లావాదేవీలు జరిగాయని సీబీఐ నిర్ధారించింది.
కల్తీ నెయ్యి వ్యవహారంలో సూపరిటెండెంట్ స్థాయి అధికారి, క్లర్క్ స్థాయి ఉద్యోగి హస్తం ఉందని సీబీఐ సీట్ భావిస్తుంది. ఆ ఉద్యోగి లంచం తీసుకోవడం వల్లే కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో పెట్టారు.